హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర సమస్యలపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏం మాట్లాడుతారనే విషయంపై అందరూ ఎదురుచూస్తున్నారు.