CM KCR | హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాయాలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. వీటితో పాటు, నూతనంగా నిర్మించబడిన మెడికల్ కాలేజీ భవనాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేటలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.