ములుగు : గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద ముంపునకు గురైన రామన్నగూడెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరదలు వచ్చినప్పుడల్లా రామన్నగూడెంలో నష్టం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ కాలనీలను పరిశీలించడం జరిగింది. గతంలో మాదిరి కాకుండా శాశ్వతంగా వరద ముంపు మనకు రాకుండా, ఇబ్బంది లేకుండా కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులందరూ వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.. వరదల్లో ఎవరూ ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.
గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద ముంపునకు గురైన రామన్నగూడెంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. pic.twitter.com/5QkZch2mDX
— Namasthe Telangana (@ntdailyonline) July 17, 2022