హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పచ్చదనం పెంపుదల ఆవశ్యకత, పర్యావరణ సమతుల్యత ప్రాముఖ్యాన్ని కండ్లకు కట్టేలా ‘నమస్తే తెలంగాణ’ కార్టూనిస్ట్ మృత్యుంజయ వేసిన హరితహాసం-ట్రీ టూన్స్ కార్టూన్ల సంకలనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమయోచితంగా, ప్రతీ ఒకరికీ మొక్కల పెంపకంపై అవగాహన కలిగేంచేలా హరితహాసం-ట్రీ టూన్స్ కార్టూన్లు ఉన్నాయని, ఒక సామాజిక అంశంపై మూడు వందల కార్టూన్లతో సంకలనం వేయడం అభినందనీయమని ప్రశంసించారు. మృత్యుంజయను ప్రత్యేకంగా అభినందించారు. హరిత తెలంగాణను ప్రతిబింబించేలా ఉన్న కార్టూన్ పెయింటింగ్ను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మృత్యుంజయ బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కేవలం రాజకీయ విషయాలపైనే కాకుండా, సామాజిక అంశాలపై ప్రజలను ఆలోచింపజేసేలా కార్టూనిస్టులు గీసే చిత్రాలు మరింత మందిని ప్రకృతికి దగ్గర చేస్తాయని పేర్కొన్నారు. ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ.. ఒక మొకతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ నేడు దేశవ్యాప్తంగా లక్షల మందిని చేరడమే కాకుండా కోట్ల మొకలు నాటేలా ప్రోత్సహించిందని చెప్పా రు. ఉద్యమకాలం నుంచే సోషల్ యాక్టివిస్టుగా ఉన్న మృత్యుంజయ.. ఇప్పుడు గ్రీన్ ఇండియా చాలెంజ్ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. ఈ కార్టూన్ల సంకలనంతో త్వరలోనే ఎగ్జిబిషన్ ఏర్పాటుచేస్తామని మృత్యుంజయ తెలిపారు.