CM KCR | ఈ నెల 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పటాన్చెరులో ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.