వరంగల్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ శనివారం వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ (ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మెడికల్ కాలేజీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించనున్నారు. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్కు చేరుకుంటారు. కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారు. వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్ వేర్వేరుగా పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన మూడు గంటల పాటు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపీ, పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఏర్పాట్లను పర్యవేక్షించారు.