కామారెడ్డి: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మరికాసేపట్లో కామారెడ్డిలో (Kamareddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే గజ్వేల్ (Gajwel) నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామపత్రాలను సమర్పించనున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటికి వెళ్లారు. నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలో ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేస్తారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్.. నేరుగా ప్రజా ఆశీర్వాద సభకు చేరుకుంటారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డి నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్కు వెళ్లారు కేసీఆర్. నామినేషన్ దాఖలు అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డికి బయల్దేరారు.