CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతికాలంలో దేశానికే ఆదర్శ రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం ఇనుమడించేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకొన్నామని తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని అన్నారు. ‘డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయం’ ప్రారంభోత్సవం సందర్భంలో రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
అపోహలు, అడ్డంకులు దాటుకొని..
అనేక అపోహలను, అడ్డంకులను దాటుకొని ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం, అనతి కాలంలోనే దేశానికే వన్నెతెచ్చేలా పూర్తయి అందుబాటులోకి రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్తు తరాల పరిపాలన అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం జరిగిందని తెలిపారు. అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల కట్టడమని చెప్పారు. ప్రశాంతతను ప్రసాదించే దేవాలయం మాదిరిగా, చూస్తేనే కడుపునిండేలా అత్యంత ఆహ్లాద భరితమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా నిర్మితమైన సచివాలయం.. ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ప్రభావితం చేస్తూ గుణాత్మక మార్పునకు బాటలు వేయనున్నదని పేర్కొన్నారు.
ద్విగుణీకృత పాలనా కేంద్రం
కాలానుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ, ప్రజా ఆకాంక్షలకు అనుకూలంగా మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, వాటిని సాకారం చేసే దిశగా సుపరిపాలన కొనసాగేలా సచివాలయ నిర్మాణం జరిగిందని సీఎం చెప్పారు. ఒక రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరును పెట్టడం దేశంలోనే మొదటిసారి అని గుర్తుచేశారు. అంబేదర్ మహాశయుని పేరు పెట్టుకోవడం వెనక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, పేద వర్గాలకు సమాన హకులు దకాలనే సమున్నత లక్ష్యమున్నదని వెల్లడించారు. ఎదురుగా తెలంగాణ అమరుల స్మారక జ్యోతి, పకనే ఆకాశమంత ఎత్తున అంబేదర్ మహాశయుడు రేపటి తరానికి దిక్సూచిగా నిలిచి నిరంతరం స్ఫూర్తిని రగిలిస్తుండగా, తెలంగాణ పాలనా సౌధం నుంచి జాతి మెచ్చే సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు అందాలనే లక్ష్యంతో అంబేదర్ పేరును సచివాలయానికి పెట్టామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ సకల జనుల సంక్షేమ పాలనను అందిస్తున్నదని చెప్పారు.
పేరుపేరునా అభినందనలు
సచివాలయాన్ని అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో అమోఘమైన పాత్ర పోషించిన కూలీలను, మేస్త్రీలను, నిర్మాణంలో కష్టించి పనిచేసిన అన్ని వృత్తుల నిపుణులను, అపురూపంగా మాడల్ అందించిన ఆరిటెక్టులను, విరామమెరుగక రేయింబవళ్లు పనిచేసిన కాంట్రాక్టు ఏజెన్సీలను, ఇంజినీర్లను, ఆర్అండ్బీ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను, ఇంజినీర్లను, సిబ్బందిని, నిర్మాణంలో పాల్గొన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని పేరుపేరునా సీఎం కేసీఆర్ అభినందించారు.
ఆత్మగౌరవ బావుటా ప్రత్యేకతలివే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేకపోయింది. దీంతో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.
క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసు
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్కమిటీ పాత సచివాలయం కండిషన్ బాగా లేదని సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించింది. ఆర్ అండ్ బీ ఈఎన్సీ నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి పలు లోపాలను గుర్తించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నివేదిక ఇచ్చింది.
సచివాలయానికి శంకుస్థాపన
నూతన సచివాలయం నిర్మాణం – అడుగులు
విస్తీర్ణం వివరాలు
మొత్తం భూ విస్తీర్ణం : 28 ఎకరాలు
భవనం నిర్మించిన ఏరియా : 2.5 ఎకరాలు
ల్యాండ్ సేపింగ్ : 7.72 ఎకరాలు
సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ : 2.2 ఎకరాలు
పారింగ్ : 560 కార్లు, 700ల బైక్లు
యాన్సిలరీ బిల్డింగ్ ఏరియా : 67,982 చ.అ.
ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా : 8,58,530 చ.అ.
లోయర్ గ్రౌండ్ + గ్రౌండ్ + ఆరు అంతస్థుల్లో
ఒకోదాని ఎత్తు : 14 అడుగులు
అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు
భవనం పొడవు, వెడల్పు : 600 X 300
ప్రధాన గుమ్మటాలు (సైలాంజ్) : 11వ అంతస్థు
జాతీయ చిహ్నం
ప్రధాన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించారు.
మినీ రిజర్వాయర్
సచివాలయ భూగర్భంలో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలోని 9 ఎకరాల పచ్చిక బయళ్ల నిర్వహణకు ఈ నీటినే వాడుతారు.
ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు
ఆరో అంతస్థులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్తో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాచేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా క్యాబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.
సచివాలయంలో అంతస్థుల వారీగా విభాగాల వివరాలు
గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు
1వ అంతస్థు: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖలు
2వ అంతస్థు: ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖలు
3వ అంతస్థు: మున్సిపల్, ఐటీ, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, వ్యవసాయం
4వ అంతస్థు: ఫారెస్ట్, లా, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, పౌర సరఫరాలు, యువజన సర్వీసులు-సాంస్కృతిక శాఖలు
5వ అంతస్థు: ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్థు: సీఎం, సీఎస్, సీఎంవో ఉన్నతాధికారులు, పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు