హైదరాబాద్ : తెలంగాణ భవన్ వద్ద గులాబీ శ్రేణుల సంబురాలు ఆకాశన్నాంటాయి. పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ అభిమాని ప్లకార్డు ప్రదర్శించారు. దేశ్ కా నేత.. టుడే సీఎం.. టుమారో పీఎం.. జై కేసీఆర్ సర్.. జై డీఎన్ఆర్ అన్న అని ప్రదర్శించిన ప్లకార్డు వైరల్ అవుతోంది. ఇక తెలంగాణ భవన్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. గిరిజనుల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. మరికాసేపట్లో కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు.
టుడే సీఎం.. టుమారో పీఎం.. ఆకర్షిస్తున్న ప్లకార్డు pic.twitter.com/qCE2qKV5yw
— Namasthe Telangana (@ntdailyonline) October 5, 2022