హైదరాబాద్: సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కుటుంబ సమేతంగా జై అంబే మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా బేగంపేటలోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. దర్శనానంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు.