హైదరాబాద్: సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి గద్వాలకు బయల్దేరారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని పరామర్శించనున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మరణించిన విషయం తెలిసిందే. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు గద్వాల వెళ్లనున్నారు.