CM KCR | బెస్ట్ ఫుడ్ ఆఫ్ చైన్గా ఉండాల్సిన భారతదేశం.. కెనడా నుంచి కంది పప్పు దిగుమతి చేసుకుంటుందా? లక్షల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటామా? సిగ్గుచేటు అంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకే ఒకమాట నా మనసును అనేక రోజుల నుంచి కలిచివేస్తుంది. చాలా బాధపెడుతుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇవాళ భారతదేశం, ప్రజల లక్ష్యం ఏంటి? భారతదేశాన్ని తన లక్ష్యాన్ని కోల్పోయిందా? దారి తప్పిందా? బిత్తరపోయి గత్తర పడుతున్నదా? ఏం జరుగుతుంది ఈ దేశంలో నా అంతరాత్మ అనేక రోజులుగా కలిచివేస్తుంది. దేశంలో ఎవరి అడుక్కునే అవసరం లేని, ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకునేలేనటువంటి, అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేని, విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి సహజ సంపద, దేశ ప్రజల సొత్తు లక్షల కోట్ల ఆస్తి ఉన్నది. లేకపోతే పర్లేదు కానీ ఉండీ కూడా ఎందుకు యాచకులం కావాలి?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘అమెరికాలోమనకంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుంది. వారికి ఉన్న 29శాతమే. చైనా మనకన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉంటుంది. వ్యవసాయభూమి 16శాతం మాత్రమే. భారతదేశ భూభాగం ఎకరాల్లో 83 కోట్ల ఎకరాలు. ఇందులో సరాసరి సగం 41కోట్ల ఎకరాలు సాగుకు అనుకూల భూమి ఉంది. అపారమైన జలసంపద కురిసే వర్షపాతం 1.40లక్షల టీఎంసీలు. ఇందులో 70 టీఎంసీలు ఆవిరైపోతే.. మనం ఉపయోగించుకోగలగే నీరు 75వేల టీఎంసీలు. భూమి, నీరుంది. పంటలు పండేందుకు అద్భుతమైన సూర్యరశ్మి ఉంది. భారతదేశంలో ఆపిల్ పండుతుంది. మామిడి పండ్లు పండుతాయి. కష్టించి పని చేసే జాతిరత్నాలు జనాభా ఉన్నది. ఇన్ని కలిగి ఉన్న దేశంలో పిజ్జాలు, బర్గర్లా మనం తినేది. అద్భుతమైన పంటలు పండించి, సాగునీరు పైకి తెచ్చి దానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టి.. కోట్లాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది. బెస్ట్ ఫుడ్ ఆఫ్ చైన్గా ఉండాల్సిన దేశం.. కెనడా నుంచి కంది పప్పు దిగుమతిచేసుకుంటుందా? ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? లక్షల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటామా?’ అంటూ మండిపడ్డారు.
‘దేశంలో 75వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే ఈ రోజు ఎత్తుకొని వాడుకుంటున్నది 19, 20వేల టీఎంసీలే. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కోట్లాది మందికి విషపు మంచినీళ్లా గతి. దీనికి ఎవరు దీనికి బాధ్యులు. ఎవరీ పాపాత్ములు. అందుకే అడిగా భారతదేశానికి లక్ష్యం ఉందా? అని. లక్ష్యం కోల్పోయాం. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్పా.. తర్వాత అతీగతి లేదు. మన రాష్ట్రంలోనే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు. 19 సంవత్సరాలు గడిచిపోయాయి. హరీ లేదు శివా లేదు. 20 సంవత్సరాలు దాటినా.. ట్రిబ్యునల్ ఉలూపలుకు లేకపోతే.. తీర్పు చెప్పుడెప్పుడు.. ఆ తర్వాత డిజైన్లు అయ్యేదెప్పుడు.. ప్రాజెక్టులు కట్టేతెప్పుడు? ప్రజలకు సాగునీరు, తాగునీరు వచ్చేదెప్పుడు. దీనికేమైనా అంతర్జాతీయ రాజనీతి కావాలా? ప్రపంచబ్యాంకు వద్ద చిప్ప పట్టుకోవాలా? అవసరం లేదు కదా? ఇది నిజం కాదా? నీళ్లివ్వ చాత కాదు.. నదుల్లోని నీరు సముద్రంలోకి వెళితే నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ప్రజలను గోల్మాల్ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.