మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 6 : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం సీతా రాముల కల్యాణ మహోత్సంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తిభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, పూర్ణహూతి తదితర పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిర, ఎంపీటీసీలు,సర్పంచ్లు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.