హైదరాబాద్ : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణుని జన్మదినం, హిందువులకు పర్వదినమని సీఎం అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ జీవన విధానంలో గీతాచార్యుని తాత్వికత, బోధనలు, ఆచరణ అత్యంత ప్రభావశీలమైనవని కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా భగవాన్ శ్రీకృష్ణుని దీవెనలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.