హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త శాంతి బోధనలను అనుసరించాలని, తోటి వారిపట్ల త్యాగం, కరుణ సహనం ప్రదర్శించాలనే సందేశాన్ని బక్రీద్ నుంచి నేర్చుకోవాలని సీఎం తెలిపారు.