హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తాను నమ్మిన విశ్వాసంతో తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీలేని పోరాటాన్ని నడిపారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారన్నారు.
బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన తెలంగాణకు అందించిన సేవలను, చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించిన బాపూజీ, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించి చరిత్రలో నిలిచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానమే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.