హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ (Aarogya Trust Chairman) గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ రావు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Harish Rao, Errabelli Dayakar Rao) ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు చైర్మన్గా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) ఆశయాలను నెరవేర్చేలా, ప్రజలకు మరింత సేవ చేసేలా కృషి చేయాలని సుధాకర్ రావుకి సూచించారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సేవలను ప్రజలకు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలని వారు అభిలాషించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆకుల లలిత తదితరులు ఉన్నారు.