హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్.. నేరుగా అధికారులతో సమావేశమయ్యారు.
ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్, అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ పలువురు రైతు సంఘాల నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ఎంపీలతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ కార్యాలయాల పనులను కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిపాలన, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిధుల సమీకరణపై సీఎస్ సోమేశ్ కుమార్తో హస్తినలోనే సీఎం సమీక్షించారు.