CM KCR | రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా మూడోరోజు సమీక్ష నిర్వహించారు. ఇటీవల నాలుగైదు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలకు గోదావరి ఉప్పొంగగా.. వరదలు ముంచెత్తాయి. వరదలపై ఎప్పటికప్పుడు నేతలు, అధికారులతో ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరుసగా శనివారం వరుసగా మూడో రోజు మూడో రోజు మంత్రులు, అధికారులు విస్తృతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
క్షేత్రస్థాయిలో సహాయక చర్యల గురించి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భద్రాచలం వద్ద పరిస్థితి, అప్రమత్తతపై ఇంజినీర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈఎన్సీలు, చిఫ్ ఇంజినీర్లకు దిశానిర్దేశం చేశారు. ముంపును తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇన్ఫ్లోను అంచనా వేసి, ఇతరశాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.