CM KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్( Nanded )లోని శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో కంధార్ లోహా( Kandhar Loha )లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభ( BRS Public Meeting ) కు కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్కు కేసీఆర్ బయల్దేరిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ సభకు ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహా పట్టణాలు గులాబీమయం అయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంక్షేమ పథకాలను మరాఠా వీడియో డాక్యుమెంటరీల ద్వారా సభ నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు.