హైదరాబాద్ : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం చేతులెత్తిసింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రం తీసుకుంటే ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు పెడుతం. కేంద్రం తీసుకొని పరిస్థితుల్లో మనం ఎక్కడ పెడుతం. మనకు నిల్వ చేసేందుకు గోడౌన్లు లేవు. సైంటిఫిక్ గోడౌన్లు కేవలం ఎఫ్సీఐ వద్దనే ఉన్నయ్. రాజ్యాంగ బద్ధమైన బాధ్యత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉన్నది కేంద్ర ప్రభుత్వ బాధ్యతనే ఉన్నది.
ధాన్యం నిల్వ చేసేందుకు శాస్త్రీయమైన పద్ధతులు రాష్ట్రాల వద్ద ఉండవ్. కేంద్రం చేతులెత్తేసిన పరిస్థితుల్లో ధాన్యం సేకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు. కొనుగోలు కేంద్రాలుండవు. సొంతంగా అమ్ముకునే రైతులు యాసంగిలో వరి వేసుకోవచ్చు. పేగులు తెగే వరకు కొట్లాడినం. రైతుల బతుకులతో కేంద్రం చెలగాటం ఆడుతోంది. బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్రం ఒప్పుకోలేదు. ధాన్యం కొనమంటే హుజురాబాద్ అని చెత్త మాట్లాడుతోంది. కరోనా సమయంలో మక్కలు, జొన్నలు కొంటే ఇప్పటికీ రూ.10వేల కోట్లు రాష్ట్రం నష్టపోయింది. పంట కొనుగోళ్ల వల్ల రైస్ మిల్లర్లను ప్రోత్సహించి బాయిల్డ్ రైస్ పెట్టిందే కేంద్రం. చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నరు.
కేంద్రం కొనకపోతే ప్రధాని, కిషన్రెడ్డి ఇండ్ల ముందు పోస్తం
ఈ వర్షాకాలం పంటను పూర్తిగా మేం కొంటాం. కేంద్రం మా దగ్గర కొనకపోతే బీజేపీ ఆఫీస్ ముందు, ప్రధాని ఇంటి ముందు పోస్తం. వెయ్యి లారీలు పెట్టి తీసుకొని పోయి ఢిల్లీ గేట్ వద్ద పోస్తం. వర్షాకాలంల ఎంతైనా కొంటం అంటున్నడు కదా కిషన్రెడ్డి. ఇక చూస్తం.. కొనలేదనుకో ఈడ కిషన్రెడ్డి ఇంట్ల పోస్తం. బీజేపీ ఆఫీసు కాడ పోస్తం.. ఢిల్లీల ఇండియా గేట్ కాడ పోస్తం. మీ తప్పుడు విధానాలతోని, మీకు దేశాన్ని నడిపే చేతకాక, ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టేచేత కాక.. మీ అసమర్థ విధానాల వల్ల దేశాన్ని అప్పుల పాలు చేస్తరు. రైతులను ఆగమ్ చేస్తరు.
పంటలు కొనుగోలు చేయరు. ఉల్టా రాష్ట్ర ప్రభుత్వాల మీద బదనాం పెడుతరు ఎక్కడి పద్ధతి. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కిషన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి ఎక్కడికైనా? . మీ పార్టీ ఫోరంలా మాట్లాడు. మా సిగ్గు పోతంది అవుతల. కేసీఆర్ షెంటుతండు అని చెప్పు.. తీసుకురా టార్గెట్.. గిన్ని టన్నులు కొంటం తెలంగాణ అని చెప్పు.. అది మొగతనం. రాజకీయం సంగతి చూద్దాం. ఒక్క హుజురాబాద్ గెలువగానే ఇంత అహంకారమా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్ని ఏకగ్రీవం అయ్యాయి? మీ పార్టీ ఎక్కడా? అని ప్రశ్నించారు.