నల్లగొండ : నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సందర్శించనున్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లి కళాకారుడు రవీందర్రెడ్డి వ్యవసాయ శాఖ తరఫున అర ఎకరంలో 15 క్వింటాళ్ల వివిధ రకాల ధాన్యాలతో సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి చిత్రపటాలను రూపొందించారు. ఈ చిత్రపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.