CM KCR | హైదరాబాద్ : సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటని సీఎం పేర్కొన్నారు. పత్రికా సంపాదకుడిగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్రను, వారి సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో ఛాతి నొప్పితో అలీఖాన్ కింద పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. జహీరుద్దీన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు నిర్వహించిన గద్దర్ అంతిమయాత్రలో జహీరుద్దీన్ పాల్గొన్నారు.