హైదరాబాద్ : ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం పోరాడుతూ, అతి చిన్న వయసులో బిర్సా ముండా ప్రాణత్యాగం చేశారని కొనియాడారు.
దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో బిర్సా ముండా చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ, వారి అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని కేసీఆర్ తెలిపారు.