CM KCR | బసవేశ్వరుని ఆశయాలు కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన్ను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు బసవేశ్వరుడు అని కొనియాడారు. వర్ణ వివక్ష, లింగ వివక్ష లేని సమాజం కోసం దాదాపు 900 ఏండ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడు అని ప్రశంసించారు.
నాటి కాలంలోనే పార్లమెంటరీ ప్రజాస్వామిక పాలనకు బసవేశ్వరుడు బీజం వేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. బసవేశ్వరుడి జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. వారి ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని అన్నారు. బసవేశ్వరుని స్ఫూర్తిని రేపటి తరాలకు కొనసాగించేందుకు గుర్తుగా ట్యాంక్బండ్పై కాంస్య విగ్రహం నెలకొల్పుకున్నామని చెప్పారు. కోకాపేటలో బసవ భవన్ కోసం రూ.10 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. కులమతాతలకు అతీతంగా మనుషులంతా ఒక్కటేనని.. బసవేశ్వరుని సమతా తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు.