CM KCR | నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, రేఖా నాయక్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఎల్లపెల్లి శివారులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.