CM KCR | హైదరాబాద్ : ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది అని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో జయశంకర్ లేకపోవడం బాధాకరం అని అన్నారు. జయశంకర్ ఆకాంక్ష తెలంగాణ ప్రగతిలో అనునిత్యం ప్రతిబింబిస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ అమరుల స్ఫూర్తితో ప్రగతి ప్రస్థానం కొనసాగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయంపాలనా స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ సాధన కోసం వారు చేసిన కృషి అజరామరమైనదని సీఎం అన్నారు. జయశంకర్ గారు ఆకాంక్షించిన…
— Telangana CMO (@TelanganaCMO) June 21, 2023