CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు భవనాలను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు బయల్దేరి వెళ్లనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట నుంచి నాగర్కర్నూల్ జిల్లాకు వెళ్తారు. హెలిప్యాడ్ నుంచి కేసీఆర్ కాన్వాయ్లో బయల్దేరి.. మధ్యాహ్నం 3:45 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4:05 గంటలకు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి, అటు నుంచి నేరుగా సమీకృత కలెక్టరేట్ భవనానికి బయల్దేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. స్థానికంగా ఉన్న వెలమ ఫంక్షన్ హాల్ పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 5:30 గంటలకు కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్కు బయల్దేరుతారు.