హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన చాంబర్ నుంచి ఆకస్మికంగా బయటకొచ్చిన సీఎం కేసీఆర్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులును వెంటబెట్టుకొని భోజనశాల వద్దకు వచ్చారు. అక్కడ భోజనాలు చేస్తున్న ఎమ్మెల్యేలను ఆప్యాయంగా పలకరించారు. భోజనాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. తనకూ భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. తనకు ప్రత్యేక కుర్చీ వేయడంతో వద్దని వారించి, ఎమ్మెల్యేల కుర్చీలోనే ఆశీనులయ్యారు. భోజనాలు బాగున్నాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు.