ఖమ్మం, జనవరి 17 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఆరోగ్య తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోనూ వైద్యకళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం కానున్నా యి. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్పెషలిస్ట్ వైద్యులు, ప్రొఫెసర్లు, మెడికోలు వందలాది సంఖ్యలో అందుబాటులోకి వచ్చి, నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.