హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పేర్కొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు పీఆర్సీని అమలుచేస్తూ 30 శాతం వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచి మున్సిపల్ కార్మికుల సేవలకు గౌరవాన్ని ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రాంబాబు యాదవ్ కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూప్సింగ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సిలివేరు ప్రభాకర్, శివశంకర్, బీ కృష్ణయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.