నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెలలో శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్సయిన యోధుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలనే శివాజీ స్ఫూర్తిని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని తెలిపారు.
– వేల్పూర్