హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజల భద్రతకు మరింత భరోసానిచ్చే తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కొలువుదీరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం 1.16 గంటలకు ఈ భారీ భవన సముదాయాన్ని ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెం టర్ (సీసీసీ)లో సీఎం కేసీఆర్కు హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్వాగతం పలికారు. తొలుత ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టించారు.
అనంతరం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సరిగ్గా మధ్యాహ్నం 1.16 గంటలకు ప్రారంభోత్సవం చేశారు. పూజల అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ‘ఏ’ టవర్ను సీఎం కేసీఆర్ సందర్శించారు. అనంతరం ఈ టవర్ 18వ అంతస్తులో ఏర్పాటుచేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చాంబర్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సీపీ సీటులో సీవీ ఆనంద్ను లాంఛనంగా కూర్చోబెట్టారు. ఆ తరువాత 14వ అంతస్తులోని పోలీస్ మ్యూజియంను, ఆపై ముఖ్యమంత్రి చాంబర్ను కేసీఆర్ ప్రారంభించారు. ప్రత్యేక పూజలతోపాటు సర్వమత ప్రార్థనలు చేశారు.
సీసీసీ పనితీరును సునిశితంగా పరీశీలించిన సీఎం కేసీఆర్
సీసీసీని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ఆ ఆవరణలో ప్రతి విభాగాన్ని స్వయంగా పరిశీలించారు. మొత్తం కలియతిరిగారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ సీఎం కేసీఆర్కు అన్ని అంశాలను వివరించారు. ముఖ్యమంత్రి చాంబర్ అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా టవర్-ఈలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి దాదాపు 30 నిమిషాలపాటు అక్కడే గడిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎమ్మెల్సీలు వాణీదేవి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, నవీన్రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, రాజాసింగ్, బిగాల గణేశ్గుప్తా, నోముల భగత్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, రోడ్లు, భవనాలశాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, పలు జిల్లాల ఎస్పీలు, సీపీలు, సీనియర్ పోలీస్ అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్లు అనురాగ్శర్మ, దినేశ్రెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, పీర్జాదీగూడ మేయర్ జకా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీసీసీ పనితీరుపై లైవ్ డెమో
సీసీసీ పనితీరుపై పోలీస్ అధికారులు ఇచ్చిన లైవ్ డెమోను పరిశీలించారు. సీసీసీ నుంచి లైవ్ ద్వారా నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను సీసీటీవీ ఫుటేజీ లైవ్ ద్వారా చూశారు. అదేవిధంగా మల్టీ ఏజెన్సీ సెంటర్ పనితీరు, రియల్ టైంలో వెహికిల్ ట్రాకింగ్ విధానం, లైవ్లో యాదాద్రి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణాలను సీఎం కేసీఆర్ చూశారు. ఎమర్జెన్సీ సమయాల్లో ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏవిధంగా పనిచేస్తుందన్న అంశాలను డీజీపీ మహేందర్రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం టవర్ ‘సీ’ లోని ఆడిటోరియానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ సాధించిన విజయాలపై ఏర్పాటుచేసిన లఘు చిత్రాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. ఈ నిర్మాణంలో భాగస్వాములైన అధికారులను జ్ఞాపికలతో సత్కరించారు. తెలంగాణ పోలీస్ ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.