హైదరాబాద్: సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో యాదాద్రికి చేరుకోనున్నారు. అక్కడ వీవీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను ప్రారంభిస్తారు. ఆలయ సంప్రోక్షణ సందర్భంగా నిర్వహించనున్న యాగశాల నిర్వహణ స్థలాన్ని పరిశీలిస్తారు.
అనంతరం భువనగిరిలో కొత్తగా నిర్మించిన అధునాతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకొని నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 4 గంటలకు రాయిగిరిలోని బహిరంగ సభాలో పాల్గొంటారు.