హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాలతో రూపొందించిన ‘ఆకుపచ్చని వీలునామా’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తొలి కాపీని పద్మశ్రీ తిమ్మక్కకు కేసీఆర్ అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మొక్క నాటడమనేది ఒక కార్యక్రమం కాదని, అది మనల్ని, మన భవిష్యత్తు తరాలను బతికించే మార్గమని అన్నారు. ఆ భాద్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. మంచి పనిలో నిమగ్నమైతే, గొప్పగా జీవించొచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనటానికి పద్మశ్రీ తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని, అందరూ ఆ బాటలో నడవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.