Himanshu Rao | సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పెద్ద మనసును చాటుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని కార్పొరేట్ స్కూల్కు ధీటుగా తీర్చిదిద్దారు. సీఏఎస్ అధ్యక్షుడిగా తన పాఠశాలలో సేకరించిన నిధులు దాదాపు రూ.కోటి హిమాన్షు ఈ పాఠశాలను వెచ్చించారు. ఈ నెల 12న హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాలలను ప్రారంభించనున్నారు.
అయితే, హిమాన్షు ఖాజాగూడలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న సమయంలోనే.. అదే ఏరియాలోని కేశవనగర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శిస్తూ.. అక్కడి విద్యార్థులతో మాట్లాడుతుండే వారు. అక్కడి విద్యార్థులు పాఠశాలలో ఎదురవుతున్న ఇబ్బందులను విద్యార్థుల ద్వారా తెలుసుకొని చలించిపోయిన హిమాన్షు.. పాఠశాలను తీర్చిదిద్దాలని సంకల్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకున్నారు. ఇందు కోసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు సేకరించారు. ఇందు కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
దాంతో వచ్చిన డబ్బులతో స్కూల్ను అన్నిహంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్ పేర్కొన్నారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. సర్కారు పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హిమాన్షును పలువురు అభినందిస్తున్నారు.
Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president.
It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July🥰🥰
Would love to share the story behind this project soon! pic.twitter.com/sylJE3dUx0
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 9, 2023