నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 9: మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ విభిన్న పథకాలను అమ లు చేస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో 6.32 లక్షల ఉచిత చేప పిల్లలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, కలెక్టర్ డాక్టర్ గోపితో కలిసి శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..
రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మత్స్యకారులు గతంలో అనేక కష్టాలు పడ్డారని, దేశం లో ఇంకా ఇదే పరిస్థితి ఉన్నదని, తెలంగాణలో మత్స్యకారుల కష్టాలను కేసీఆర్ తీర్చారని స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చాక మత్స్యకార్మికుల కోసం సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 753 చెరువుల్లో 365 రోజులు నిండు కుండల్లా నీళ్లు ఉంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.