రాజన్న సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణ మంజూరుకు సీఎం కేసీఆర్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. మున్సిపల్శాఖ మంత్రి రామారావు విజ్ఞప్తి మేరకు మూలవాగుపై తక్షణమే చెక్డ్యాంలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా ఇతర విజ్ఞప్తులపై కూడా సీఎం సానుకూలంగా స్పందించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు, ఇంజినీర్ కాలేజీ మంజూరు, రాజరాజేశ్వరి జలశాయం అభివృద్ధిలో భాగంగా టూరిజంశాఖకు 243 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింతకు ఆదేశించారు. కాగా మెడికల్ కాలేజీ మాత్రం వచ్చే విడతలో మంజూరు చేయనున్నట్లు సీఎం తెలిపారు.