హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలన చేయరాకపోతే దిగిపో మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశం పరువు రోజురోజుకు దిగజారుతోందని కేటీఆర్ మండిపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
ఎవరూ శాశ్వతం కాదు.. మోదీ కంటే ముందు చాలామంది ప్రధానులు అయ్యారని కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ బ్రహ్మ కాదు కదా శాశ్వతంగా ప్రధానిగా ఉండటానికి అని ఆయన అన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో దివాలా తీస్తోంది… అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. మోదీ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం ఖునీ చేస్తొందన్నారు. అన్ని రంగాల శాఖలను దుర్వినియోగం పరిస్తున్నారు. మోదీ పాలనలో 8 ప్రభుత్వాలను కూల్చారు. మోదీ పాలనలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని కేసీఆర్ తెలిపారు.
ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేరాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్క హామీనైనా మోదీ నెరవేర్చితే ఇవాళ చెప్పాలని డిమాండ్ చేశారు. టార్చ్ లైట్ పెట్టి వెతికినా మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు దొరకడం లేదన్నారు. ఏ ఒక్క వర్గానికి మోదీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. రైతులు 13 నెలలు ఆందోళన చేశారు… ఆందోళన చేసిన రైతులను మోదీ బూతులు తిట్టారని పేర్కొన్నారు. 700 మంది రైతులు మృత్యువాత పడ్డారు. మరణించిన రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు.