హైదరాబాద్ : సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారాలు చేస్తున్న వారిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ఓ క్షుద్ర విద్య అని కేసీఆర్ విమర్శించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
అది సోషల్ మీడియా కాదు.. అది క్షుద్ర విద్య.. అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. దాన్ని బండారం బయటకు తీస్తాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను బయటికి తీస్తాం. జర్నలిజం అని పేరు పెట్టి సమాజాన్ని మోసం చేయడం సరికాదు.
దళితబంధు అనేది గొప్ప పథకం. ఇండియా మొత్తంలో మెడికల్ షాపుల్లో, వైన్స్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఈ సత్తా బీజేపీకి ఉందా? ఇప్పుడు దళితులు ఓనర్లు, కాంట్రాక్టర్లు అవుతుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దళితబంధు, రైతుబంధు మీద కారుకూతలు కూస్తున్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. వాస్తవాలు ఈ విధంగా ఉంటే.. క్షుద్ర విద్య, క్షుద్ర రాజకీయం పెట్టి మీ ఇష్టమొచ్చిన సొల్లు పురాణం సోషల్ మీడియాలో కుమ్మరిస్తుంటే మేం చూసుకుంటూ ఉండాలా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోంది అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.