హైదరాబాద్: నవరస నట సార్వభౌమ బిరుదాంకితుడు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం తెలియజేశారు. కైకాల సత్యనారాయణ చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్నమైన పాత్రలను పోషించారని, వైవిధ్యమైన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
కైకాల సత్యనారాయణ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కైకాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.