హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ దినపత్రికల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావును పరామర్శించారు. దామోదర్రావు తండ్రి నారాయణరావు ఈ నెల 2వ తేదీన మరణించిన సంగతి తెలిసిం దే. దామోదర్రావు తండ్రి నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకొన్నారు. నారాయణరావు సతీమణి, దామోదర్రావు తల్లి ఆం డాళమ్మను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట ప్రణాళికాసంఘం ఉ పాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, కూర్మయ్యగారి నవీన్కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి శ్రవణ్రెడ్డి ఉన్నారు.