హైదరాబాద్ : దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు. పవిత్ర జమ్మి ఆకును సీఎం కేసీఆర్ అందరికీ అందించి, దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీఎంవో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.