హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలిరోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను రజత పతకం సాధించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. మీరాబాయికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్లో మన దేశ క్రీడాకారులంతా ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని సీఎం ఆకాంక్షించారు.