CM KCR | హైదరాబాద్ : ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల(93) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యుల భాషాసాహిత్య కృషిని కేసీఆర్ కొనియాడారు. అధ్యాపకులుగా, ఉపన్యాసకులుగా, రచయితగా, వ్యాకరణ పండితుడిగా తెలుగు, సంస్కృత భాషలకు వారు చేసిన సేవలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుమారుడు ఎడిటర్ కె శ్రీనివాస్ సహా కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల పూర్వ అధ్యాపకుడు కండ్లకుంట అళహ సింగరాచార్యులు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ ఎల్బీ నగర్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.