హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య(87) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య.. ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న గంగుల కమలాకర్.. తన ఇంటికి చేరుకున్నారు. తండ్రి భౌతికకాయాన్ని చూసి మంత్రి బోరున విలపించారు.
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సంతాపం ప్రకటించారు.