హైదరాబాద్ : సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కోసూరి అమర్ నాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కరోనాతో సీనియర్ జర్నలిస్టు అమర్నాథ్ మృతి చెందిన విషయం విదితమే. గత పది రోజుల క్రితం అమర్నాథ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు.