హైదరాబాద్: ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి గాదరి మారయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కిశోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నల్లగొండ మండలం నర్సింగ్భట్లకు చెందిన గాదరి మారయ్య పీఈటీగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సేవలందించారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో కుటుంబంతో కలిసి శేషజీవితం గడుపుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మారయ్య మరణించారు.
ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య మృతిపట్ల గుండెపోటుతో ఆకస్మిక మృతిపట్ల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.