హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్పై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. ఈ నెల 6న మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్కు బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరువుతారు.
కాగా, బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అంటే ఈ నెల 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 8న బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పనున్నారు. 9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. వచ్చే ఆదివారం (ఈనెల 12న) సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.