హైదరాబాద్ : దేశానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(KCR) విజనరీ లీడర్ షిప్(Leader ship) అవసరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు(Kesav Rao) అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చూసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్(BRS) ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కు బలం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యకర్తలేనని స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయంలో కార్యకర్తలు(BRS Activists) గొప్ప పాత్ర పోషించారన్నారు. నాయకులు,కార్యకర్తలు కలిసి పనిచేస్తూ పార్టీని ‘ నేషనల్ మిషన్'(National Mission) తో ముందుకు తీసుకుపోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్(Minister KTR) హైదరాబాద్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. దేశమే అబ్బురపడేలా యాదాద్రి(Yadadri) దేవాలయ పునర్నిర్మాణం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue), కొత్త సెక్రటేరియట్ వంటి గొప్ప గొప్ప నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.
నిన్నటి దాకా నదులు సముద్రంలో కలిసేవని నేడు కేసీఆర్ పాలనలో నదులు పొలాలకు , ఇండ్లళ్లకు మళ్లుతూ సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయంటూ అభివర్ణించారు. గత ప్రభుత్వాలు 75 ఏండ్లలో చేయలేని పనులను 9 ఏండ్లలో చేసి చూపించగలిగామన్నారు. ప్రధాని మోదీ(Narendra Modi) దేశాన్ని అదానీ(Adani) కి దోచిపెడుతుంటే, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి మళ్లీస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని జల వనరుల లభ్యతను, నదీ ప్రవాహాలను స్క్రీన్ పై ఇంజినీర్ లా సోదాహరణంగా వివరించిన సీఎం కేసీఆర్ వంటి నాయకుడు మరొకరు లేరన్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారని, ప్రజారోగ్యం రంగంలో తెలంగాణ తెచ్చిన సంస్కరణలను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ గొప్పగా ప్రశంసించిందని కేశవరావు గుర్తు చేశారు. ప్రైవేటైజేషన్ కాదు నేషనలైజేషన్ కావాలన్న ప్రొగ్రెసివ్ లీడర్ సీఎం కేసీఆర్ అని ఆయన వెల్లడించారు.